104 ఉద్యోగస్తుల రెగ్యులర్ చేయాలని రిలే నిరసన దీక్ష

104 ఉద్యోగస్తుల రెగ్యులర్ చేయాలని రిలే నిరసన దీక్ష

ముద్ర ప్రతినిధి, నల్లగొండ:-కాంట్రాక్టు పద్ధతిలో ఉన్న 104 ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలని జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగస్తులు చేపట్టిన నిరసన దీక్ష గురువారానికి 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న మాకు ఉద్యోగ భద్రత లేకుండా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేకుండా చాలి చాలని జీతాలతో రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్నామని 1350 మంది ఉద్యోగులను ప్రభుత్వ పట్టించుకోవట్లేదు అన్నారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, ప్రతినెల సరైన సమయంలో జీతాలు, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ప్రభుత్వ వేతనాలు మా అకౌంట్లకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగాలు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.