వైసీపీకి 11 సీట్లు దేవుడి స్కిప్ట్ : చంద్రబాబునాయుడు

వైసీపీకి 11 సీట్లు దేవుడి స్కిప్ట్ : చంద్రబాబునాయుడు

అమరావతి, ముద్ర వార్తలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు రావడమన్నది దేవుడి రాసిన స్క్రిప్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి రాజధాని కోసం ఈ ప్రాంత రైతులు 1631 రోజులు ఉద్యమం చేశారని, ఇందులోని అంకెలన్నింటిని కలిపితే 11 అని, వైసీపీకి వచ్చిన సీట్లు కూడా అంతేనని అన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్టేనని అన్నారు. అయితే, ఇంతటి విధ్వంసం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ 11 సీట్లు ఇవ్వడం కూడా కరెక్టేనా కా అన్న అంవంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగే అర్హత వుందా అన్న అంశాన్ని ప్రజలే పరిశీలించాలన్నారు.

 అమరావతి ప్రాంతంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం అమరావతిపై వ్యవహరించిన తీరుపై ఫైర్ అయ్యారు. ఈ ప్రాంతంలో వైసీపీ విధ్వంసం చేసిందన్నారు. గత ఐదేళ్ళలో అమరావతిలో అంగుళం పని కూడా జరగలేదన్నారు. పైగా విచ్చలవిడిగా పనిగట్టుకుని నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పరిస్థితి చూస్తే బాధేసిందన్నారు. రాజధాని నిర్మాణ సామాగ్రిని ఎత్తుకెళ్లిన వాళ్ల నుంచి.. ఈ ప్రాంతంలో రౌడీయిజం చేస్తున్న వాళ్ళ వరకూ ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారిని నిర్మొహమాటంగా అణిచివేస్తామన్నారు.