నార్సింగి లో 12 కేజీల గంజాయి స్వాధీనం

నార్సింగి లో 12 కేజీల గంజాయి స్వాధీనం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:  రాజేంద్రనగర్ గండిపేట్ మండలం లోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల టార్గెట్ గా నిబంధనలకు విరుద్ధంగా అరకు నుండి గంజాయిని హైదరాబాద్ కు తెచ్చిన గంజాయి అమ్ముతున్న ముఠాను విశ్వసనీయ సమాచారం ప్రకారం నార్సింగి చౌరస్తాలో నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాం కి చెందిన 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద చిన్నచిన్న ప్యాకెట్లను ప్యాక్ చేసిన 12 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆరకు నుండి గంజాయి ని తెచ్చిన ఒక ముఠా ఎవరికి అనుమానం రాకుండా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మై హోమ్ సమీపంలోని పనిచేసే అస్సాం కి చెందిన 4 గురు సెక్యూరిటీ గార్డులను వాడుకొని గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లను విక్రయించేవారు. 4 గురు సెక్యూరిటీ గార్డులపై ఎన్ డి.పి ఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.