ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 12 కిలోల గంజాయి స్వాధీనం

ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 12 కిలోల గంజాయి స్వాధీనం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద ట్రావెల్స్ బస్సులపై ఎక్సైజ్ అధికారుల దాడులు నిర్వహించి ఓ బస్సులో 12కేజీల గంజాయినీ పట్టుకున్నారు. ఒడిషా నుండి హైదరాబాద్ కు బస్సులో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిషా,విశాఖపట్నం ఏజన్సి ప్రాంతాల నుండి ట్రావెల్స్ బస్సుల ద్వారా గంజాయి సరఫరా అవుతుంద అన్న సమాచారంతో బస్సుల పై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు.సంకేత్ బాలు కోట్ అనే వ్యక్తి వద్ద 12 కిలోల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నరు.