టోల్ ప్లాజా వద్ద రూ. 13.50 లక్షలు పట్టివేత

టోల్ ప్లాజా వద్ద రూ. 13.50 లక్షలు పట్టివేత

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా సమీపంలో శనివారం రాత్రి రూ.13.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఎలాంటి ధృవ పత్రాలు లేని ఈ మొత్తాన్ని తరలిస్తున్న సమయంలో పట్టుకున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. ఈ మొత్తాన్ని కలెక్టరేట్ లో డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు.