హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు

హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు

ముద్ర ప్రతినిధి భువనగిరి :హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ  భువనగిరి జిల్లా కోర్టు సంచల తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం మోటకొండూరు మండలంలోని దిలావర్ పూర్ లో 11ఆగష్టు 2018 న సీస యాదగిరి గౌడ్ అనే వ్యక్తిని ఆదే గ్రామానికి చెందిన 14 మంది వ్యక్తులు కలిసి సమూహికంగా మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో హత్య చేసినందున నేరం రుజువు కావడం తో భువనగిరి జిల్లా అదనపు జడ్జీ మారుతీ దేవి తీర్పు వెల్లడించారు.

జీవిత ఖైదు విదించినట్లు మోటకొండూరు ఎస్ ఐ తేజం రెడ్డి తెలిపారు.మోటకొండూర్ పీఎస్‌ పరిదిలో 14 మంది హత్య కేసులో జీవిత ఖైదు Cr No 44/2018 U/S 147,148,452,302, R/w 149 IPC, మోటకొండూర్ PS యొక్క SC No 243/2019, బుర్రి రాజేష్ ,చొప్పరి శ్రవణ్ ,సొప్పరి నరేష్ ,చొప్పరి సత్యనారాయణ ,చొప్పరి అంజమ్మ , చెక్కా సత్యనారాయణ, దండు రవి , చొప్పరి శంకర్, చొప్పరి మహేందర్,చొప్పరి సందీప్ , చెక్కా సత్తయ్య ,మనగల్ల పుల్లయ్య తదితరులు ఉన్నారు .