కళ్యాణం... కమనీయం

కళ్యాణం... కమనీయం

భూదాన్ పోచంపల్లి,ముద్ర:- భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దంతూరు గ్రామంలో గల శ్రీ బసవలింగేశ్వర స్వామి 16వ వార్షికోత్సవంలో భాగంగా సోమవారం కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వందలాది మంది భక్తులు అత్యంత భక్తులతో స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం కొత్త మైసయ్య-యాదమ్మ, కొత్త శ్రీధర్ గౌడ్-లావణ్య దంపతులచే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్, ఆలయ చైర్మన్ మన్నె వెంకటరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు సామ మధుసూదన్ రెడ్డి,  సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు సామ రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ దోటి కుమార్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ బోదాసు శీను, ఆలయ వైస్ చైర్మన్ పల్లెర్ల పాండు యాదవ్, ప్రధాన కార్యదర్శి మురళి కృష్ణ, సహాయ కార్యదర్శి బోదాసు ఈదయ్య,జూపల్లి లింగస్వామి,కోశాధికారి ఎర్ర కొండల్ గౌడ్, కంబాలపల్లి సత్తయ్య యాదవ్,గోరుగంటి రవీందర్, కొసనం శేఖర్ యాదవ్, పల్లెల రమేష్ యాదవ్, సిద్ధగోని లింగస్వామి గౌడ్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు,