నాలుగవ రోజు పదకొండు మంది అభ్యర్డులు నామినేషన్లు దాఖలు

నాలుగవ రోజు పదకొండు మంది అభ్యర్డులు నామినేషన్లు దాఖలు

ముద్ర ప్రతినిధి భువనగిరి : నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నాలుగవ రోజైన సోమవారం భువనగిరి పార్లమెంటు కు సంబంధించి పదకొండు మంది అభ్యర్డులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి హనుమంతు కే జండగే తెలిపారు. భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్దిగా క్యామ మల్లేష్ 3 సెట్లు, జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్దిగా నల్ల కరుణాకర్ రెడ్డి ఒక సెట్.. స్వతంత్య్ర అభ్యర్ధిగా వరికుప్పల కృష్ణ ఒక సెట్. పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ అభ్యర్ధిగా వింధ్యాల సదానందరెడ్డి 2 సెట్లతో.స్వతంత్ర అభ్యర్దిగా భాషబోయిన లక్ష్మయ్య ఒక సెట్ తో. స్వతంత్ర అభ్యర్ధిగా కొంగరి మల్లయ్య ఒక సెట్ తో. తెలంగాణ రిపబ్లిక్ పార్టీ అభ్యర్ధిగా కందాడి మణిపాల్ రెడ్డి ఒక సెట్ తో. స్వతంత్ర అభ్యర్దిగా గాదెపాక అనిల్ కుమార్ ఒక సెట్ తో . స్వతంత్ర అభ్యర్ధిగా ఈదుల వీర పాపయ్య రెండు సెట్లతో. స్వతంత్య్ర అభ్యర్ధిగా నక్కల సురేందర్ ఒక సెట్ తో..ట ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్దిగా కొంగర లింగస్వామి రెండవ సెట్ దాఖలు చేశారు.