23నెలల ఎరియర్స్ చెల్లించాలి

23నెలల ఎరియర్స్ చెల్లించాలి

రామకృష్ణాపూర్,ముద్ర: 11వ వేజ్ బోర్డు ప్రకారం 23 నెలల ఎరియర్స్ ఆగస్ట్ వేతనాలతో కలిపి సెప్టెంబర్ 3న చెల్లించాలని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎం.డి.అక్బర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం రామకృష్ణాపూర్ ఓసిపి, సి.హెచ్.పి లలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోల్ ఇండియాలో ఒప్పందం జరిగి సర్కులర్ వచ్చినప్పటికీ సింగరేణి యాజమాన్యంలో చలనం లేదని మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం తక్షణమే ఏరియర్స్ చెల్లించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓసి ఫిట్ కార్యదర్శి ఆంజనేయులు, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ రాజేశ్వర్ రావు, ఆర్కే వన్ ఇయర్ ఫిట్ కార్యదర్శి సూరామళ్ల వినయ్ కుమార్,రాజశేఖర్,రామకృష్ణ,సంపత్,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.