అమరావతిలోని ఎస్–3 జోన్లో పేదలకు 268 ఎకరాలు
ఏపీ రాజధాని అమరావతిలోని ఎస్–3 జోన్లో పేదలకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద 268 ఎకరాలు కేటాయించింది. 6–5 జోన్లో కేటాయించిన 1134 ఎకరాలకు అదనంగా ఈ భూమి కేటాయించారు. గుంటూరు, ఎన్టీఆర్జిల్లాల్లో లబ్ధిదారుల సంఖ్య మేరకు లేఖ రాసిన కలెక్టర్లు. ఆ లేఖ మేరకు అదనపు భూమి కేటాయింపునకు సీఆర్డీఏ ప్రతిపాదనలు చేసింది. సీఆర్డీఏ సిఫారసు మేరకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతవరం, నెక్కల్లు, పిచ్చుకల పాలెం, బోరుపాలెంలో భూమి కేటాయింపు జరిగింది.