అమరావతిలోని ఎస్​–3 జోన్​లో పేదలకు 268 ఎకరాలు

అమరావతిలోని ఎస్​–3 జోన్​లో పేదలకు 268 ఎకరాలు

ఏపీ రాజధాని అమరావతిలోని ఎస్​–3 జోన్​లో పేదలకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద 268 ఎకరాలు కేటాయించింది. 6–5 జోన్​లో కేటాయించిన 1134 ఎకరాలకు అదనంగా ఈ భూమి కేటాయించారు. గుంటూరు, ఎన్టీఆర్​జిల్లాల్లో లబ్ధిదారుల సంఖ్య మేరకు లేఖ రాసిన కలెక్టర్లు. ఆ లేఖ మేరకు అదనపు భూమి కేటాయింపునకు సీఆర్​డీఏ ప్రతిపాదనలు చేసింది. సీఆర్​డీఏ సిఫారసు మేరకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతవరం, నెక్కల్లు, పిచ్చుకల పాలెం, బోరుపాలెంలో భూమి కేటాయింపు జరిగింది.