ఆరాంఘర్ చౌరస్తాలో కారు దగ్ధం

ఆరాంఘర్ చౌరస్తాలో కారు దగ్ధం

రాజేంద్ర నగర్: శంషాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అరాంఘర్ చౌరస్తాలో మధ్యాహ్నం మూడు గంటలకు మహేంద్ర జల్ లో ఏపీ 21సిసి 5956 వెహికల్ మంటలు అంటుకోవడం జరిగిందన్నారు. పక్కన ఉన్నటువంటి కార్లకు మంటలు అంటుకుంటే పెద్ద గోర ప్రమాదం జరిగేది అక్కడ చూస్తున్నటువంటి వారు అంటుకుంటునటువంటి వెహికల్ ని రోడ్డుమీదికి దొబ్బడం జరిగింది దానితో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని అన్నారు.

అనంతరం ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పడం జరిగిందన్నారు.అరంఘర్ చౌరస్తాలో కర్నూల్,మహబూబ్నగర్,గద్వాల,కొత్తకోట ఇక్కడి నుండి ఓన్ ప్లేట్ల ద్వారా ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతుంటారు.ఇలాంటి ఓన్ ప్లేట్ల మీద ప్రయాణికులని తీసుకు వెళ్లే కార్ల మీద ఆర్టీవో,ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు,ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి ప్రజలు కోరుతున్నారు.