మద్దుట్లలో స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి

మద్దుట్లలో స్కూల్‌ బస్సు కింద పడి చిన్నారి మృతి

ముద్ర, మల్యాల: మల్యాల మండలం మద్ధుట్లలో ఓ ప్రైవేట్ స్కూల్‌ బస్సు ఢీ కొని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది.  మద్దుట్లకు చెందిన అరిభా (2), చిన్నారి తల్లి తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కించే సమయంలో చిన్నారి అలిపా వెంట వచ్చింది..  ఈ క్రమంలో చిన్నారిపై నుంచి బస్సు ముందు టైరు వెళ్లగా చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న మల్యాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు.