న్యాయం చేయాలంటూ ఆందోళన

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఆదివారం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గోపాల్ రెడ్డి నగర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆశా కార్యకర్త ఎల్లమ్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆశా కార్యకర్తలు, బంధువులు ఆదివారం ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా  రాస్తారోకోలో పాల్గొన్న తోటి ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను అరెస్ట్ చేయాలని ప్రభుత్వ పరంగా సాయం అందించాలని   కోరారు. దీంతో రాకపోకలు భారీగా స్తంభించాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారితో మాట్లాడే ప్రయత్నం చేసినా న్యాయం జరిగేంత వరకు నిరసన నిరమింప చేసేది లేదని భీష్మించి కూర్చున్నారు. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు ఆగిపోవడంతో జిల్లా కేంద్రానికి వచ్చే వాహన చోదుకులు ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఎట్టకేలకు చిట్ట చివరకు చట్ట పరంగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.