ఇంటర్ టాప్ విద్యార్థినికి ఘన సన్మానం

ఇంటర్ టాప్ విద్యార్థినికి ఘన సన్మానం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: ఇటీవల వెల్లడైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన హరితను మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, జన్మభూమి నగర్ వాసులు ఘనంగా సన్మానించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరితను శాలువాలు, పూలమాల లతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ మంచిర్యాల జన్మభూమి నగర్ కు చెందిన హరిత రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం మంచిర్యాలకు గర్వకారణమని  కొనియాడారు.

భవిష్యత్తులో కూడా అన్ని పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. హరితకు విద్యకు అవసరమైన ఆర్థిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిగమించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బోరిగం రాజారాం, వెంకన్న , తోగరు సుధాకర్ ,శ్రీనివాస్ గుర్రాల శ్రీనివాస్, మొగిలి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.