కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టుకు ఘన సత్కారం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టుకు ఘన సత్కారం

రామన్నపేట, ముద్ర న్యూస్ :రామన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రహదారి బంగ్లాలో నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్, మండల పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి ఆధ్వర్యంలో సూర్య ప్రభంజనం ఎడిటర్,ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత ఏటెల్లి శ్రీనివాస్ ను పూలమాలలు సాలువలతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రస్థాయిలోను కాకుండా జాతీయస్థాయిలో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.