చనిపోయాడనుకున్న వ్యక్తి... రెండేళ్ల తర్వాత.....

చనిపోయాడనుకున్న వ్యక్తి... రెండేళ్ల తర్వాత.....

భోపాల్: కరోనాతో చనిపోయాడనుకున్న వ్యక్తి రెండేళ్ల తర్వాత సజీవంగా తిరిగి వచ్చాడు. మధ్యప్రదేశ్ లోని దార్ జిల్లా కరోడ్కాలా గ్రామవాసి 35 ఏళ్ల కమలేష్ పాటిదార్ 2021లో కరోనా బారినపడ్డాడు. ఆయనను గుజరాత్ రాష్ట్రంలోని వదోదరలో ఒక ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది రోజులు చికిత్స పొందిన తర్వాత ఆయన మరణించాడని ఆస్పత్రి సిబ్బంది  ప్రకటించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా వారు అంత్యక్రియలు పూర్తి చేశారు.

కానీ ఆశ్చర్యకరంగా రెండు రోజుల క్రితం పాటిదార్ తన మేనత్త ఇంటికి చేరుకున్నారు. ఆశ్చర్యంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు ఇది ఎలా జరిగిందో అర్థంకాక తల పట్టుకున్నారు. కమలేష్ పాటిదార్ వెంటనే ఏమీ చెప్పే స్థితిలో లేడు. ఎవరో చనిపోతే పాటిదార్ పేరు ఎందుకు చెప్పారో తెలవాలంటే  ఆయన గతాన్ని గుర్తు చేసుకుని చెప్పాల్సిందే.