నిజాలను నిర్భయంగా చెప్పే 'ముద్ర' వేయాలి: మంత్రి చామకూర మల్లారెడ్డి 

నిజాలను నిర్భయంగా చెప్పే 'ముద్ర' వేయాలి: మంత్రి చామకూర మల్లారెడ్డి 
A mudra of fearlessly telling the truth should be made Minister Mallareddy

మేడ్చల్ , ముద్ర ప్రతినిధి: నిజాలను నిర్భయంగా చెప్పడంలో ముద్ర ముందుండాలని జిల్లా మంత్రి చామకూర మల్లారెడ్డి ఆకాంక్షించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని చెంగిచెర్లలో  మంగళవారం మేడిపల్లి మండలం ప్రింట్ ప్రెస్ క్లబ్ డైరీని ఆవిష్కరించిన ఆయన ముద్ర దినపత్రిక సంచికను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా దినపత్రికలు పని చేయాలన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేసినప్పుడే దినపత్రికల మనుగడ ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో పిర్జాదిగూడ, బోడుప్పల్ మేయర్లు జక్కా వెంకటరెడ్డి , సామ బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా గ్రంధాలయ కమిటీ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, భారాస జిల్లా నాయకుడు మంద సంజీవరెడ్డి, ముద్ర దినపత్రిక జిల్లా ప్రతినిధి మోతె వెంకటరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.