ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్కు తృటిలో తప్పిన ప్రమాదం
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖలో జి 20 సన్నాహక సమావేశాలు, స్వాగతం పలుకుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అయితే.. ఆదివారం విశాఖ ఆర్కే బీచ్లో పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగింది.
గాలివాటం సరిగా లేకపోవడంతో వన్ సైడ్కి ఒరిగిపోయింది. దీంతో మంత్రి వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో మంత్రి సురేష్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇలా ఒక్కసారిగా క్షణాల్లో జరిగిపోవడంతో అక్కడున్న ఇతర మంత్రులు షాక్కుగురయ్యారు. మంత్రికి ఎలాంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.