రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ముద్ర, హుజురాబాద్: మండలంలోని రంగాపూర్ గ్రామ శివారులో హుజురాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... మండలంలోని రాజపెల్లి గ్రామానికి చెందిన గండ్ర కిరణ్ రెడ్డి(34) హుజరాబాద్ పట్టణంలో సొంత పనుల నిమిత్తం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో రంగాపూర్ గ్రామ శివారులోకి చేరుకోగా లైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో కిరణ్ రెడ్డి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతూనట్లు పోలీసులు తెలిపారు.