మోచి బజార్ లో డ్రైనేజీ నిర్మాణం పనులు వాయిదా వేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ కు వినతి

మోచి బజార్ లో డ్రైనేజీ నిర్మాణం పనులు వాయిదా వేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ కు వినతి

ముద్ర ప్రతినిధి జగిత్యాల: మోచి బజార్ లో  డ్రైనేజీ నిర్మాణం పనులు వాయిదా వేయాలని మార్కెట్ రోడ్, గృహ యజమానులు, వ్యాపారస్తులు మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ను మున్సిపల్ కార్యాలయంలో కలసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా  వారు మాట్లాడుతు జగిత్యాల పట్టణంలోని మార్కెట్ రోడ్ లోని మోచి బజార్ ప్రాంతంలో సరైన రోడ్డు విస్తరణ లేక డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, రోడ్డు విస్తరణ చేపట్టి డ్రైనేజీ పనులు చేపట్టాలని పేర్కొన్నారు.ప్రస్తుతం వ్యాపారం అంతంత మాత్రంగా నడుస్తోందని  డ్రైనేజీ కట్టడంతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుందని, పెళ్ళిళ్ళ, రంజాన్ పండుగ ఉన్నందున డ్రైనేజీ విస్తరణ  పనులు నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె. నాగలక్ష్మి, ప్రసాద్, శివ ప్రసాద్, నరేష్,భారతి,శ్రీ రామ్, కార్తిక్ తదితరులు ఉన్నారు.