ప్రగతి భవన్ ​వద్ద దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం బీఆర్ఎస్ పార్టీ వైస్ ఎంపీపీ మనోహర్ సొంత తమ్ముడు, అతడి భార్య హైదరాబాద్​లో ప్రగతి భవన్ ​వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. తమ గోడు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాహత్నానికి పాల్పడినట్లు తెలిపారు.