దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి

దర్యాప్తులో ఉన్న కేసులలో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలి

పెండింగ్ పనుల వల్ల వత్తిడి పెరుగుతుంది, పనులు పెండింగ్ లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలి

పోలీస్ అధికారుల నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ రాజేంద్రప్రసాద్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట

జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశంలో సూచనలు చేసిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ 


జిల్లా లో నమోదు అవుతున్నా అయా కేసులలో అధికారులు పకడ్బదీగా పారదర్శకంగా విచారణ చేపట్టాలని,  అందుకు క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ను పెంపొందించుకోవాలని  జిల్లా ఎస్పీ శ్రీ రాజేంద్ర ప్రసాద్  పోలీస్ అధికారులకు తెలియజేశారు.  


అందులో బాగంగా ముందుగా జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో పెండింగులో ఉన్న కేసుల వివరాలను, UI కేసులను సమీక్షించి పెండింగ్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగులో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను 
ఆదేశించారు. పనులు పెండింగ్ ఉంచడం వల్ల పని వత్తిడి పెరుగుతుందనీ, కావున ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసుకోవాలి అని ఎస్పీ  సూచించారు. కేసులు విచారణలో నిర్లక్ష్యం చేయవద్దని, ప్రణాళిక తో
పనించేయాలి అన్నారు.  కేసుల విచారణలో బాధితుల, సాక్షుల, నిందితుల వాగ్మూలం SOP ప్రకారం నమోదు చేయాలని, కేసు దస్త్రాలు ఫైల్ చేయుట, పోటో స్ , ప్రాపర్టీ సీజ్, నిందితుల వివరాలు ఎంట్రి చేయట, రిమాండ్ డైరీ చార్జి షీట్ ఫైల్ల్ చేయుట తదితర అంశాల పై సమీక్షించి SHO లకు తగు సూచనలు చేశారు.

ప్రస్తుత కాలంలో ప్రజలు రోడ్డు ప్రమాదలకు ఎక్కువ గా గురవుతున్నారని, అందుకు వారికి రోడ్డు నియమాలు, రోడ్డు భద్రత, ట్రాపిక్ నియమాల పై అవగాహనా కల్పించాలని అన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. ఎస్సై లు తప్పని సరిగా గ్రామాలను సందర్శించాలని, ప్రతీ వారం కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించాలని అధికారులను అదేశించారు. బ్లూ కోల్ట్స్,పెట్రోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన విధులను ఖచ్చితంగా పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు వారికి తగు సూచనలు చేయాలని అదేశించారు. పోలీసు ఫంక్షనల్ వర్టికల్ కు సoబందించి సిబ్బంది పనితీరును రోజు వారిగా సమీక్షించుకోవాలని ఎస్సై లకు సూచించారు.
నేరాల నియంత్రణలో చేదనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి  ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. 5S విధానంలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని. 
అనంతరము పోలీస్ వాహనాలను జిల్లా ఎస్పీ  ఇన్స్పెక్షన్ చేశారు. పోలీస్ వాహన డ్రైవర్లతో మాట్లాడుతూ  ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల మెకానిజం పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 
ఈనెల సమీక్షా సమావేశంలో DSP లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, DCRB DSP రవి, CI సోమ్ నారాయణ్ సింగ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, DCRB ఇన్స్పెక్టర్ నర్సింహ, CI లు ఆంజనేయులు, రామలింగారెడ్డి రాజశేఖర్, శివ శంకర్, వీర రాఘవులు, రామకృష్ణా రెడ్డి, RI లు శ్రీనివాస రావు, గోవిందరావు, శ్రీనివాస్, నర్సింహారావు, SI లు
సిబ్బంది ఉన్నారు.