దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్ అందజేత

దివ్యాంగుడికి మూడు చక్రాల సైకిల్ అందజేత

ముద్ర.వనపర్తి:- ఎన్నికల ప్రచారంలో దివ్యాంగుడికి ఇచ్చిన మాట ప్రకారం మూడు చక్రాల సైకిల్ అందించి మాట నిలబెట్టుకున్నా వనపర్తి కౌన్సిలర్ జయసుధ మధుసూదన్ గౌడ్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వనపర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్ జయసుధమధుసుధన్ గౌడ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ప్రచారం లో భాగం గా 10 వార్డ్ నాగవరంలో ప్రచారం లో తిరిగేటప్పడు  మన్యం అనే దివ్యాంగుడు తన మూడు చక్రాల బండి పాడయింది కొత్త సైకిల్ ఇప్పించమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెగా రెడ్డి తరఫున ప్రచార నిర్వహించటానికి వచ్చిన మున్సిపల్ కౌన్సిలర్ జయసుధమధుసూదన్ గౌడ్ ను కోరారు. ఎమ్మెల్యేగా మెగారెడ్డి గెలిస్తే తప్పకుండా మూడు చక్రాల సైకిల్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగుడు మన్యం కు శుక్రవారం ఎమ్మెల్యే మెగా రెడ్డి చేతుల మీదుగా మూడు చక్రాల బ్యాటరీ సైకిల్ ను కౌన్సిలర్ జయసుధమధుసూదన్ గౌడ్  సొంత డబ్బులతో   ఇప్పించి ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్ సతీష్,చెర్ల్ చందర్, నాగేష్ ఉమేష్ కదీర్ రమేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.