మానవత్వంతో మహిళను ఆసుపత్రికి తరలించిన ఏసీపీ నాగభూషణం

మానవత్వంతో మహిళను ఆసుపత్రికి తరలించిన ఏసీపీ నాగభూషణం

ముద్ర/షాద్ నగర్:- రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించి శంషాబాద్ ట్రాఫిక్ ఏసిపి నాగభూషణం మానవత్వం చాటుకున్నారు. గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సులో అతిగా మద్యం సేవించిన ఓ వ్యక్తి తన భార్యను వేధించడంతో ఆ బాధ భరించలేక ఆ మహిళ ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు నుండి కింద దూకి తీవ్రంగా గాయపడింది.

అటుగా వస్తున్న ట్రాఫిక్ ఏసిపి నాగభూషణం ప్రమాదంలో గాయపడిన మహిళను చూసి ఆటోలో షాద్ నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లో ని ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. మానవత్వంతో ఏసిపి నాగభూషణం ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రి తరలించడం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మాహిళ పేరు మర్యం భర్త దస్తగిరి ,హస్నాబాద్, కొడంగల్ నియోజకవర్గంగా గుర్తించారు.