ఆంధ్రప్రదేశ్లో గ్లాసు ప్రభంజనం...

ఆంధ్రప్రదేశ్లో గ్లాసు ప్రభంజనం...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-  ఆంధ్రప్రదేశ్ ఎన్నిక ఫలితాల్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 19 చోట్ల ఆధిక్యంలో ఉంది. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ జనసేన పార్టీ సత్తా చాటుతోంది. అటు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లోనూ జనసేన ఆధిక్యంలో ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలిచిన జనసేన ఈసారి సునామీ సృష్టిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.