ఈ నెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఈ నెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21 నుంచే ప్రారంభం కానున్నాయి. 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, సభాపతి ఎన్నిక జరగనుంది.అంతకుముందు శాసనసభ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.