ఆమ్రాబాద్‍లో పులుల సందడి

ఆమ్రాబాద్‍లో పులుల సందడి

టైగర్‍ ఫారెస్టు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి

 మహబూబ్‍ నగర్‍: నాగర్‍ కర్నూల్‍ జిల్లా అమ్రాబాద్‍  టైగర్​ రిజర్వ్ ఫారెస్టులో  పులులు సందడి చేస్తున్నాయి. ఈ  టైగర్​ రిజర్వ్ ఫారెస్టులో ప్రస్తుతం 26 పులులు ఉన్నాయి.   తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ   అమ్రాబాద్‍  టైగర్​ రిజర్వ్ ఫారెస్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. తాజాగా  మన్ననూర్‍లోని వనమాలికలో నూతనంగా నిర్మించిన 6 కాటేజీలు, 8 సఫారీ వాహనాలను ప్రారంభించింది. ఈ టైగర్​ రిజర్వ్ ఫారెస్టులో  వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది.

దీంతో అడవుల ప్రత్యేకత కాపాడుతూనే, పర్యావరణహిత టూరిజం అందుబాటులోకి  తీసుకువచ్చింది ప్రభుత్వం. దీనిలో భాగంగా అటవీ ప్రాంతాలు,  టైగర్​ రిజర్వుల సమీపంలో మరిన్ని ఎకో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ రూపొందించింది. అమ్రాబాద్‍  టైగర్​ రిజర్వ్ ఫారెస్ట్ లో రూ. 1.20 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేసిన 8 సఫారీ వాహనాలు, రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించిన 6 కాటేజీలను ప్రారంభమయ్యాయి. సహజమైన అటవీ వాతావరణంలోనే పులులను వీక్షించే అవకాశం, వెసులుబాటు కల్పించింది.   ఇంకెందుకు ఆలస్యం చూసొచ్చేద్దాం రండి అన్నట్లు ఇక్కడ ఆన్‍లైన్‍లో కాటేజీలు బుక్‍ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది.