ఐశ్వర్య మృతి తీవ్రంగా కలచివేసింది

ఐశ్వర్య మృతి తీవ్రంగా కలచివేసింది

 నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్

 మేళ్ళచెరువు  ముద్ర: నేరేడుచర్ల కు చెందిన తాటికొండ ఐశ్వర్య  ఉన్మాది కాల్పుల ఘటన లో మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని నల్లగొండ పార్లమెంటు సభ్యులు కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విచార వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక విలేకరులతో ఫోన్లో ఆయన మాట్లాడారు.అమెరికా టెక్సాస్ లో ఓ షాపింగ్ మాల్ లో జరిగిన కాల్పుల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న నేరేడుచర్ల కు చెందిన తాటికొండ ఐశ్వర్య మృతి చెందడం చాలా బాధాకరమని ఇటువంటి సంఘటనలు జరగకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఐశ్వర్య కుటుంబ సభ్యుల కు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఐశ్వర్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, ఆమె మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి తీసుకు రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని  కోరారు.