అమరజీవి కామ్రేడ్ రాంరెడ్డి సేవలు మరువలేనివి

అమరజీవి కామ్రేడ్ రాంరెడ్డి సేవలు మరువలేనివి

పశ్య శ్రీనివాస్ రెడ్డి

హుజూర్నగర్ ,ముద్ర:అమరజీవి కామ్రేడ్ పశ్య రామిరెడ్డి సేవలు మరువలేనివని ప్రియదర్శిని విద్యాసంస్థల అధినేత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణం లోని సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ పశ్య రామ్ రెడ్డి వర్ధంతి సభను సిపిఐ నాయకులతో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాలను సాధించేందుకు ఈ ప్రాంతంలో విశేషంగా కృషి చేసిన మహనీయుడు కామ్రేడ్ రాంరెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన మరణించేంతవరకు నమ్మిన సిద్ధాంతానికి అనుకూలంగా నిరంతరం పోరాడిన కమ్యూనిస్టు నాయకుడు రామ్ రెడ్డి అన్నారు అనంతరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన వైష్ణవి దేవిని సన్మానించారు కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్, దేవరం మల్లీశ్వరి, కెవిఎన్ మూర్తి ,పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ,   శ్రీనివాస్ వెంకన్న ,సైదులు, మల్లయ్య, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.