భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 

భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 
  • షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి 
  • షాద్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి 

ముద్ర, షాద్‌నగర్:- షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ  మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పెద్ద ఎత్తున పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి మాట్లాడుతూ...

భారత రాజ్యాంగ ప్రదాత, దేశ పాలనా మార్గదర్శకాల విధాత, భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు నిరుపమానం అని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కొనియాడారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో నడుస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి అహర్నిశలూ కృషి చేస్తోందనీ, బాబా సాహెబ్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాల అడుగుజాడల్లో నడిచేందుకు ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.ఫరూక్నగర్ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ పి రఘు, మహిళా నాయకురాలు రమాదేవి, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు డంగు శ్రీనివాస్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి అందేమోహన్, చెంది తిరుపతి రెడ్డి, బాదేపల్లి సిద్ధార్థ, యువ మైనార్టీ నాయకులు జమ్రుద్ ఖాన్, ఇబ్రాహీం, ఖాదర్ గోరి, అంజద్ గోరి, జహంగీర్, గిరిజన యువ నేత శ్రీను నాయక్, దళిత నాయకుడు జాంగారి రవి, జనార్ధన్, మాజీ కౌన్సిలర్ విజయ్ కుమార్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.