ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి

ముద్ర.వీపనగండ్ల:- ఉమ్మడి వీపనగండ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర సేవలకై అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని గురువారం  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణకు వినతి పత్రం అందజేశారు.సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మురళి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి గతంలో మంజూరైన అంబులెన్స్ ను అధికారులు జిల్లా కేంద్రానికి తరలించడం జరిగిందని అన్నారు. ఉమ్మడి మండలంలోని  ప్రజలు అత్యవసర వైద్య సేవలకై ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వ్యయ ప్రయాసలతో ప్రైవేటు వాహనాలను అశ్రయిస్తూ, ఒక్కోసారి అనారోగ్య బాధితులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వ  ఆసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించే విధంగా వైద్య అధికారులు, ప్రజా ప్రతినిధులు  చర్యలు తీసుకోవాలని కోరారు.. అంబులెన్స్ సౌకర్యం కల్పించని ఎడల పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలోమండల నాయకులు ఆశన్న, ఈశ్వర్, రామకృష్ణ నవీన్ పాల్గొన్నారు.