ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో
  •  ఇద్దరు మహిళలు మృతి మరొకరి పరిస్థితి విషమం
  •  తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు చిన్నారులు

సూర్యాపేట ముద్ర ప్రతినిధి: గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందగా మరొక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. వివరాల ప్రకారం సూర్యాపేట నుండి అరవపల్లి వెళుతున్న ఆటో అంజనాపురి చౌరస్తా సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. అదే సమయంలో ఆటోను వెనకనుండి ఎర్టిగా కారు ఢీకొట్టింది. 

దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా పరిస్థితి విషమంగా ఉండటంతో మరొక మహిళను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.