ఏపీ హైకోర్టులో జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ
ఏపీ హైకోర్టులో జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కమర్షియల్ టాక్స్ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ నోటీసులను హైకోర్టులో సవాలు చేసిన ఉద్యోగుల సంఘం . ఉద్యోగుల తరపున వాదనలు వినిపించిన లాయర్లు ఉమేష్ చంద్ర, రవి ప్రసాద్. కౌంటరు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా పడింది.