బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

వరుసగా మూడు రోజుల్లో ఇద్దరు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో గురువారం తెల్లవారు జామున మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దాదాపు 2 గంటల ప్రాంతంలో పియూసి మొదటి సంవత్సరం చదువుతున్న బూర లిఖిత ఐఐటీ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎత్తు పైనుంచి దూకడం తో లిఖిత అక్కడికక్కడే మరణించింది. మృతురాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసి. మిగతా వివరాలు తెలియాల్సి వుంది.