కాంగ్రెస్ కు పూర్వవైభవం

కాంగ్రెస్ కు పూర్వవైభవం
  • కాంగ్రెస్ కు పూర్వవైభవం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. బుధవారం ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా సున్నంబట్టి వాడాలో పర్యటించారు. వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా సురేఖ మాట్లాడుతూ, కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరుగుతుందని తెలిపారు. బీఆరెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని అన్నారు.  బీఆరెస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ ను కోరుకుంటున్నట్లు చెప్పారు.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.