ఎంపీజే జిల్లా అధ్యక్షుడిగా అన్వర్

ఎంపీజే జిల్లా అధ్యక్షుడిగా అన్వర్

ముద్ర ప్రతినిధి, జనగామ: మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎంపీజే) జనగామ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశానికి ఎండి.ఖలీద్ షాహిద్ అధ్యక్షత వహించగా ఎంపీజే రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, స్థానిక నాయకులు అన్వర్ షరీఫ్, జమాల్ షరీఫ్, కౌన్సిలర్ సమద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఎంపీజే దాదాపు 18 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తుందని తెలిపారు. అనంతరం ఆ సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అన్వర్ పాషా, ఉపాధ్యక్షులుగా ఎండి హమీద్, ముజీద్, ఆజాం, ప్రధాన కార్యదర్శిగా సలీం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రియాజ్, ప్రచార కార్యదర్శిగా బషీద్, కోశాధికారిగా అబ్దుల్లా, అకౌంటెంట్ సుమేర్ అహ్మద్ ఖాన్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.