అరకపట్టి పొలం దున్నిన భట్టి

అరకపట్టి పొలం దున్నిన భట్టి

రైతుల మధ్య ఉగాది పండుగ

ముద్ర, ప్రతినిధి,  మంచిర్యాల : అరక పట్టి... పొలం దున్నీ రైతులను ఆనందపరిచారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క. బుధవారం ఉగాది పర్వదినం కావడంతో పాదయాత్ర కు బ్రేక్ ఇచ్చారు. కెరమెరి మండలం బాలేమోడీ గ్రామంలో రాత్రి బస చేశారు. సరిహద్దు మహారాష్ట్ర ఉండడంతో ఉగాది పర్వదినంను రైతులు మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా జరుపుకుంటారు.   పశువులకు రైతులు పుజలు చేయగా భట్టి కూడా వారితో పూజలో పాల్గొన్నారు. పశువులకు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఉగాది సాంప్రదాయం ప్రకారం రైతు లతో కలిసి అరకపట్టి జోడెద్దులతో వ్యవసాయ భూమిని దున్నారు. ఉగాది సంధర్భంగా భట్టి కుటుంబ సభ్యులు బాలే మోడీ గ్రామంకు రావడంతో వారితో పండుగ జరుపుకున్నారు.