కార్మికులకు ఏరియర్స్ చెల్లించాలి

కార్మికులకు ఏరియర్స్ చెల్లించాలి

రామకృష్ణాపూర్,ముద్ర: 11 వ వేతన ఒప్పందం ప్రకారం కార్మికులకు అందించే వేతనాలతో పాటు ఏరియర్స్ చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రాంచ్ అధ్యక్షులు వెంకటస్వామి హాజరై మాట్లాడారు. మందమర్రి ఏరియాలో నీతి నిజాయితీగా పనిచేసిన ఏరియా జనరల్ మేనేజర్ ను గుర్తింపు సంఘం ఒత్తిళ్లతోనే బదిలీ చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ రాజేందర్, ఆర్గనైజర్ వెంకటేష్, వెంకటేష్, రమేష్, భరత్ తదితరులు పాల్గొన్నారు.