నెమలిని చంపిన నిందితుల అరెస్టు 

నెమలిని చంపిన నిందితుల అరెస్టు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  జాతీయ పక్షి నెమలిని చంపిన కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. పెగడపల్లి పోలిస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ వివరాలు వెల్లడించారు.  పెగడపల్లి మండలం దోమలకుంట వద్ద జాతీయ పక్షి నెమలిని చంపిన కేసులో సత్యనారాయణ,రాజు అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

గంగాధర మండలానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి దోమల కుంట శివారులో లైసెన్స్ లేని తుపాకితో సంచరించి జాతీయ పక్షి నెమలిని కాల్చి చంపి కారులో తీసుకెళ్తుండగా ఐతుపల్లి వద్ద  పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడు. వారి వద్ద నుండి తుపాకితో పాటు 34 తూటాలు, ఒక గొడ్డలి, కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు సత్యనారాయణ కు గతంలో మహదేవ్ పూర్ వద్ద జింకల వేటతో కూడా ప్రమేయం వున్నట్లు డీఎస్పీ వెల్లడించారు