అందుబాటులో ఏటీఎం సేవలు...

అందుబాటులో ఏటీఎం సేవలు...

ముద్ర.వీపనగండ్ల:-మండల కేంద్రమైన వీపనగండ్లలో బ్యాంకు వినియోగదారులకు అందుబాటులోకి ఏటీఎం సేవలు తెచ్చినట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ రవీందర్ బాబు తెలిపారు. ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండల పరిసర ప్రాంతాలలో ఏటీఎం కేంద్రాలు లేకపోవడంతో వినియోగదారులు డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడేవారు. కొన్ని సంవత్సరాలుగా బ్యాంకు పరిధిలోని ఏటీఎం కేంద్రం పనిచేయకపోవడంతో వినియోగదారులు అత్యవసరంగా డబ్బులు పొందటానికి ఇతర మార్గాలను ఎంచుకునేవారు. బదిలీపై వచ్చిన బ్యాంకు మేనేజర్ రవీందర్ బాబుకు ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు విజ్ఞప్తి చేయడంతో పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఏటీఎం కేంద్రం ఏర్పాటు కావడం పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.