కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా...

కొండగట్టు ఘాట్ రోడ్డుపై ఆటో బోల్తా...

ముద్ర, మల్యాల : మండలంలోని కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంచిర్యాల జిల్లా లక్షేట్ పేట మండలం మ్యాదరిపేట చెందిన భక్తులు శనివారం శ్రీ ఆంజేయస్వామిని  దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఘాట్ రోడ్డులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న 11 మందికి గాయాలు అయ్యాయి. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి . విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.