ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారుతున్నా భూమి లబ్యత
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
- కన్హా శాంతివనంలో మూడు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ సదస్సు..
- 18 దేశాల ప్రతినిధులు సంస్థల హాజరు
ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి ప్రపంచ వ్యాప్తంగా భూమి లబ్యత సమస్యగా మారుతుంధని, ప్రపంచవ్యాప్త భూమి లబ్యత పై గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ధీని వల్ల ప్రపంచ ఆహార భద్రత మరియు పర్యావరణ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పు వాటిల్లిందని ఆయన అన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ మండలం లో ఉన్న కన్హా శాంతివనంలో మూడు రోజుల పాటు జరగనున్న "వాతావరణములో వస్తున్న మార్పులపై, భూమి ఆరోగ్యం" పై అంతర్జాతీయ సదస్సును మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. కన్హా శాంతి వనంలో జరుగుతున్న మూడు రోజుల "4 పర్ 1000 ఆసియా - పసిఫిక్ ప్రాంతీయ సదస్సు" కోసం 18 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వేతర సంస్థలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు భూమి మీద ఉన్న చెట్లు, జీవాలు మనుగడ సాధించాలంటే భూమి నీ సంరక్షించుకోవాలని, ఏ కారణాల వల్ల భూమికి నష్టం జరుగుతుందో దాన్ని నిలువరించే మార్గాలతో పాటు రసాయన ఎరువుల వాడకాన్ని తగించడం లాంటి వాటి పై జరుగుతున్న ఈ సదస్సు లో మనదేశం తో వివిధ దేశాల శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని మా ప్రభుత్వం మట్టి, పర్యావరణంపై గత కొన్నేళ్లుగా విశేష కృషి చేసిన తెలంగాణలో నేను ఉండడం గర్వంగా ఉంది అన్నారు. మట్టి సూక్ష్మజీవులు, కీటకాలు మరియు మూలాలతో కూడిన సంక్లిష్ట జీవన పర్యావరణ వ్యవస్థ అని, ఇది నీరు మరియు పోషకాల రిజర్వాయర్ అని అన్నారు.ఇది జీవవైవిధ్యాన్ని నిలబెట్టి, వాతావరణాన్ని నియంత్రిస్తుందని అన్నారు.స్థిరమైన వ్యవసాయం అనగా, పంట మార్పిడి మరియు ఆలస్యాన్ని తగ్గించగల పంట, ఇవి నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయనీ మరియు కోతను తగ్గిస్తాయని పేర్కోన్నారు.
నేల నిర్మాణాన్ని మెరుగుపరిచే పోషక స్థాయిలు మరియు అటవీ నిర్మూలనను గుర్తించడానికి క్రమబద్ధమైన నేల పర్యవేక్షణ మరియు పరీక్షలు కాలుష్యాన్ని తగ్గించడం మరియు స్థిరమైన వ్యర్థాల నిర్వహణ ఇతర అంశాలు పై దృష్టి సరించాలని అన్నార్.మన భూగోళాన్ని పచ్చగా మార్చడం ప్రాముఖ్యతను ప్రపంచానికి బోధిస్తున్నందున, దీనికి వేదికగా కన్హ శాంతి వనాన్ని ఎంచుకున్న ప్రతినిధి బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. కన్హా శాంతివనం దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిజీ దేశ గ్రామీణ, సముద్ర అభివృద్ధి విపత్తు నిర్వహణ మంత్రి, సకియాసి రాల్సేవు డిటోకా, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్, థియరీ బెర్తేలోట్, హార్ట్ఫుల్నెస్ గైడ్, రామ్ చంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ, డాక్టర్ పాల్ లూ, 4 పర్ 1000' ఇనిషియేటివ్ యొక్క కార్యనిర్వాహక కార్యదర్శి, తెలంగాణ వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.