చేవెళ్లలో రామరాజ్యం రావాలి - కొండా

చేవెళ్లలో రామరాజ్యం రావాలి - కొండా

రంగారెడ్డి, ముద్ర : చేవెళ్ల ప్రాంతంలో రామరాజ్యం విలసిల్లాలని ఆకాంక్షించారు బిజెపి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆయన చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం లోని సీతారాంపూర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ప్రజలందరికీ ధర్మబద్ధమైన జనరంజక పాలన అందాలన్నారు.

సీతారాంపూర్ రామాలయం చెందిన భూములు స్థానికులకు దక్కాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వాలు కబ్జా కోరుల్లా పారిశ్రామికవేత్తలకు సీతారాంపూర్ భూములను అప్పగించిందని వాటన్నింటినీ తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాశ్వతంగా భూములను అప్పగించకుండా లీజుకు ఇవ్వడం ద్వారా రైతులకు రామాలయానికి ఆదాయం దగ్గర చూడాలని ఆయన కోరారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో పాటు చేవెళ్ల బిజెపి నాయకులు కార్యకర్తలు సీతారాంపూర్ ఆలయం సందర్శించి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు.