జగిత్యాలలో బిజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జగిత్యాలలో బిజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ నియోజకవర్గం కార్యాలయం కమలా నిలయంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వ్హహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, నియోజకవర్గ ఇంచార్జి డా.భోగ శ్రావణి బిజేపీ జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ఏకాత్మ జాతీయవాద సిదంతాల పునాదులపై ఏర్పడి పార్టీ బిజేపీ అన్నారు. దేశ ప్రగతి, ప్రజా సంక్షేమం, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో భారత్ ను విశ్వగురువుగా నిలబెట్టాలనే అకుంఠిత దీక్షకు అంకితమైన ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ కలిగిన పార్టీ కేవలం బిజేపీ అన్నారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్ ,జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబరి కళావతి,జిల్లా మహిళ మోర్చా కార్యదర్శి మ్యాకల లక్ష్మి, జగిత్యాల పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత,జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజం, పట్టణ ఉపాధ్యక్షులు గాదాస్ రాజేందర్, గడ్డం లక్ష్మి, భానుప్రియ, మధురిమ, కవిత, సోమలక్ష్మి పాల్గొన్నారు.