ముచ్చటగా మూడోసారి మోడీని ప్రధానిని చేద్దాం

ముచ్చటగా మూడోసారి మోడీని ప్రధానిని చేద్దాం
  • విజయ సంకల్ప యాత్రలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-దేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి ప్రధాని చేయడానికి ప్రజలు సహకరించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు కోరారు. బిజెపి చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో ర్యాలీ అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతో కూడిన సుస్థిర ప్రభుత్వాన్ని అందించిన ఘనత బిజెపి పార్టీకి, ప్రధాని మోడీకి దక్కుతుందన్నారు. ఈసారి 370 కి పైగా స్థానాల్లో బిజెపిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రాంతం నుండి ఎక్కువ స్థానాల్లో బిజెపి పార్టీ తరఫున ఎంపీలను ఢిల్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు చెప్పే కల్లబొల్లి కబుర్లను, మాయమాటలను లోక్ సభ ఎన్నికలలో ప్రజలు నమ్మవద్దని, ఆ రెండు పార్టీలను తిప్పి కొట్టి బిజెపికి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు.  బీ ఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రజలు కన్న కలలు కల్లలయ్యాయని ఆరోపించారు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల అభిమానాన్ని చూరగొన లేదన్నారు. ఈ విజయ సంకల్పయాత్ర, ర్యాలీలలో  బిజెపి సీనియర్ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ మళ్లీ శ్రీ వర్ధన్ రెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, కర్నాటి కిషన్, తుక్కని మన్మధ రెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, సలిగంటి వీరేంద్ర, ఆబిద్, రంగినేని లక్ష్మణరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.