నిర్మల్ లో బిజెపి అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా బిజెపి అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీ తో విజయం సాధించారు. మొత్తం మెజార్టీ, సాధించిన ఓట్లు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. తొలి రౌండ్ నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన మహేశ్వర్ రెడ్డి ని ఏ దశలోనూ ప్రత్యర్థులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీహరి రావు అడ్డుకోలేక పోయారు. నాలుగో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి రావు కౌంటింగ్ సెంటర్ ను వీడి వెళ్ళిపోయారు. కాగా మంత్రి అల్లోల ఎనిమిదో రౌండ్ పూర్తి కాగానే కౌంటింగ్ సెంటర్ వీడి వెళ్ళిపోయారు.