తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం: రఘునాథ్ రావు

తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం: రఘునాథ్ రావు
BJP coming to power in Telangana Raghunath Rao

ముద్ర, ప్రతినిధి మంచిర్యాల: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ విజయం సాధించి తీరుతుందని ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు ధీమా వ్యక్తం చేశారు.  శుక్రవారం హమాలివాడ, అశోక్ రోడ్ ,చున్నంబట్టి, చెన్నూరు గేట్ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ప్రజా ఘోస కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో రఘునాథ్ రావు మాట్లాడుతూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యిందని  అన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన బిజెపి అధికారంలోకి వచ్చేంత సంఖ్యాబలాన్ని సొంతం చేసుకుంటుందని తెలిపారు.

బిజెపి అధికారంలోకి వస్తేనే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే  బిజెపి ప్రభుత్వం రావాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి తెలంగాణను బిజెపి అభివృద్ధి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే మంచిర్యాల నియోజకవర్గంలో బిజెపికి అధికారం కట్టబెడితే మంచిర్యాలను అభివృద్ధి లో ముందువరుసలోకి తీసుకు వెళ్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.