తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రానీయ్యం

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రానీయ్యం
  • లౌకిక, ప్రజాస్వామిక శక్తులను కలుపుకుపోదాం
  • మోడీ భయపడుతున్నాడు: తమ్మినేని వీరభద్రం విమర్శ
  • అప్పుల మోడీని దించేయాలి: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
  • మన దేశం భిన్నత్వంలో ఏకత్వంలా ఉంటుంది : జూలకంటి రంగారెడ్డి
  • జనచైతన్య యాత్రకు సంఘీభావం ప్రకటించిన సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
  • బీజేపీ మహిళలకు వ్యతిరేకం: మల్లు లక్ష్మి

 నల్గొండ ముద్ర న్యూస్: భారతీయతను నాశనం చేస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రానీయ్యమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. దేశాన్ని కాపాడేందుకే రాష్ట్రవ్యాప్తంగా జనచైతన్య యాత్రలను చేపట్టినట్టు ప్రకటించారు. రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా ప్రధాని మోడీ భయపడుతున్నాడని అర్థమవుతున్నదని అభిప్రాయపడ్డారు. బీజేపీని ఓడిరచేందుకు దేశంలోని లౌకిక, ప్రజాస్వామిక శక్తులను కలుపుకుపోతామని చెప్పారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జనచైతన్యయాత్ర బహిరంగ సభ జరిగింది. దీనికి సిపిఎం జిల్లా కార్యదర్శి  ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేయడం ద్వారా బీజేపీ తన రాజకీయ ప్రయోజనాలను నేరవేర్చుకునే పనిలో ఉందని చెప్పారు. ఆ కుట్రలు, కుతంత్రాలను సాగనివ్వబోమని ప్రకటించారు.

తాము దిగిపోయినా, తమ ప్రభావాన్ని కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దుర్మార్గమైన ధ్వేషపూరిత వాతావారణాన్ని సృష్టిస్తున్నారని నిరసన తెలిపారు. క్రమపద్ధతి ప్రకారం తొమ్మిదేండ్లుగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య భావనలకు పాతరేస్తూ ఇష్టారాజ్యంగా పరిపాలించడం ద్వారా  ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని వివరించారు. బీజేపీకి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రకులాల పేదలు అవసరం లేదనీ, వారికి కేవలం కార్పొరేట్లు, పెట్టుబడిదారుల కావాలని వ్యాఖ్యానించారు. హిందువుల కోసం బీజేపీ ఎలాంటి పథకాలు తేవడం లేదనీ, కాగా కుల, మతాల రొచ్చును రుద్దుతూ సమాజాన్ని కలుషితం చేస్తున్నారని చెప్పారు. ఒకే కులం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.ఆదానీ సంపదంతా ఆక్రమాల నెలవని విమర్శించారు. వందల కోట్ల పేద ప్రజలపై మోడీకి ప్రేమ లేదనీ,కేవలం అదానీ, అంబానీలే కావాలని చెప్పారు.

ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేయడం ద్వారా రిజర్వేషన్లకు ఎసరుపెడుతున్నారని చెప్పారు. అందుకే బీసీ జనాభా లెక్కల గణనను చేపట్టడం లేదని తెలిపార. ఎందుకే ఒకవేళ లెక్కలు తీస్తే బడ్జెట్‌లో, ఉద్యోగాలు, చదువుల్లో వాటా అడుగుతారనే భయమే ఇందుకు కారణమని తెలిపారు. మనుధర్మాన్ని అమలుచేయడం ద్వారా సమాజంలో మంటపెట్టాలని బీజేపీ, సంఘ్ పరివార్‌ శక్తులు పూనుకున్నాయని చెప్పారు. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మొండి మోడీని దించేస్తామని ప్రకటించారు. చివరకు రాష్ట్రాలు అప్పులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశారని విమర్శించారు.బీజేపీ వ్యతిరేక శక్తులను పోగేసేందుకు సీపీఐ(ఎం), సీపీఐ ప్రయత్నం చేస్తున్నాయని గుర్తుచేవారు. కేరళలోబీజేపీకి ఉన్న సీటును విజయన్‌ ఊడబెరికారని చెప్పారు. తెలంగాణ గడ్డపై బీజేపీని గెలవనివ్వమని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. దొంగలను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

మోడీ దుర్మార్గుడు: ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

 దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోడీ దుర్మార్గుడని నల్లగొండ ఎమ్మల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. మతోన్మాద చర్యలు ద్వారా దేశాన్ని భ్రష్టుపట్టించే చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యాఇనంచారు. మొత్తం దేశాన్ని అమ్మకానికి పెట్టారని అన్నారు.బీజేపీ అమానుష చర్యలకు ప్రజలకు తెలియజేప్పేందుకు జనచైతన్య యాత్రనుచేపట్టిన సీపీఐ(ఎం)ను అభినందించారు. అంబానీ, అదానీల కోసం ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నారని అన్నారు. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం, ఏ ప్రధాని చేయని విధంగా అప్పులు చేశారని చెప్పారు. మోడీ రూ.152 లక్షల కోట్లఅప్పులను ప్రజలపై రుద్దారని వివరించారు.  16 రకాల సంస్థలను ప్రయివేటుపరం చేయడాన్ని ఖండిస్తున్నట్టు వివరించారు. ఈడీ,మోడీలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ భయబోరని చెప్పారు.  ప్రతిపక్షాలను అస్థీరం చేయడం ద్వారా అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీని కట్టడి చేయాల్సిన అవసరం అందరికీ ఉందని అభిప్రాయపడ్డారు. 
వామపక్షాలతో పోరాటాలు నిర్వహిస్తాం

సిపిఐ జిల్లా కార్యదర్శి  నెల్లికంటి సత్యం
కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆదాని పై సమగ్ర దర్యాప్తు జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వామపక్షాలు అందరినీ ఐక్యం చేసి ఆదాని పై చర్యలు తీసుకునే వరకు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర  ప్రభుత్వాన్ని గద్దె దించడమే వామపక్షాల లక్ష్యమన్నారు.

భిన్నత్వంలో ఏకత్వంలా భారత్‌ 
 భారత దేశం భిన్నత్వంలో ఏకత్వంలా ఉంటుందని, అలాంటి దేశాన్ని కుల,మతాల పేరుతో చీల్చే ప్రయత్నం జరుగుతున్నదని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. తొమ్మిదేండ్ల కాలంలో మహిళలు,రైతులు,కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టిందని అన్నారు. మహిళలకు బీజేపీ వ్యతిరేకమని, మనుధర్మాని అమలుచేయడం ద్వారా అణచివేతకు పాల్పడుతున్నాడని చెప్పారు. నిత్యావసర వస్తువులను ధరలను పెంచడం ద్వారా ఆర్థిక భారాలను ప్రజలు, మహిళలపై మోపుతున్నారని గుర్తు చేశారు. 2014 నుంచి ధరలు పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. గ్యాస్‌, పెట్రోల్‌ తదితర ధరలు దారుణంగా అధికమవుతూవస్తున్నాయని వ్యాఖ్యానించారు.దేశంలో మహిళలుఅనేక సమస్యలు ఎదుర్కొంఉన్నారని అన్నారు.రాజస్తాన్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో మహిళల్లో ఎక్కువగా రక్తహీనత ఎక్కువగా ఉండేదనీ, ఇప్పుడని దేశవ్యాప్తంగా అయిందని చెప్పారు. ఇందుకు బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని అన్నారు. పిల్లలను పక్కదారి పట్టిస్తున్నారని వివరించారు. ఈ విషయాన్ని నీటి అయోగ్‌ చెప్పిందని అభిప్రాయపడ్డారు. మనుగోడు తరహాలోనే తెలంగాణ గడ్డపై బీజేపీ ఓడించాలని పిలుపు నిచ్చారు.

భారీ ర్యాలీ


 మిర్యాలగూడ నుంచి నల్లగొండ వరకు జనచైతన్య యాత్ర మోటార్‌ సైకిల్‌ యాత్రలో భారీగా జనం పాల్గొన్నారు. మధ్యలో ఆయా గ్రామాల ప్రజలు యాత్రకు స్వాగతం పలికారు. ఈ యాత్రకు సంఫీుభావం చెప్పేందుకు బీఆర్‌ఎస్‌,సీపీఐ పార్టీలు నేతలు హాజరయ్యారు. జనచైతన్య యాత్ర రథసారథి పోతినేని సుదర్శన్, యాత్ర నాయకులు కోట రమేష్, పిట్టల రవి, సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,  జిల్లా నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేశం, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్ హశం, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు ప్రభావతి, మహమ్మద్ సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, గంజి మురళీధర్, నన్నూరి వెంకటరమణారెడ్డి, దండం పల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, వి. వెంకటేశ్వర్లు, రవి నాయక్, ఆనంద్, నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, కందుల సైదులు, మంగారెడ్డి, గౌతమ్ రెడ్డి,  కొండ వెంకన్న, కుంభం కృష్ణారెడ్డి, గుండాల నగేశ్, భూతం అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.