తెలంగాణ లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి

తెలంగాణ లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి

 కేంద్రమంత్రి పరుషోత్త కురుపాల పిలుపు 

ముద్ర ,ప్రతినిధి, మంచిర్యాల: రాబోయే శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణలో బీజేపీ ని అధికారంలోకి తీసుకురావాలని కేంద్ర పశు సంవర్ధక ,మత్స్య ,పాడి పరిశ్రమల శాఖ మంత్రి పరుషోత్త కురుపాల పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల ,బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ స్థాయి ముఖ్య నేతల తో కేంద్రమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ బీజేపీని గ్రామస్థాయిలో తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించాలని సూచించారు. కేంద్రంలో ,రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పోలింగ్ బూత్ స్థాయి పార్టీ శ్రేణులు బిజెపి బలోపేతంకు కష్టపడాలని  కోరారు. బెల్లంపల్లిలో ప్రోటోకాల్ విషయంలో ఇద్దరు బిజెపి నేతల మధ్య వివాదం జరిగింది. పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా హేమాజీ అనే నాయకునికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేస్తు సమావేశం నుంచి వెళ్లిపోగా సీనియర్ నేతలు బుజ్జగించి సమావేశంకు  తీసుకొచ్చారు. మంచిర్యాల లో పార్టీ నేతలతో పాటు వ్యాపారస్తులు స్వచ్చంద సేవా సంస్థలు, ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తదితరులతో  లక్ష్మీనారాయణ దేవాలయంలోని సమావేశ మందిరంలో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు పాల్గొన్నారు.