అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించిన బిజెపి

అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించిన బిజెపి

శంకరపట్నం ముద్ర జూలై 14:శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు. మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు మాట్లాడుతూ అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు  ఇవ్వాలని వీరి ఎంపిక ప్రక్రియలో పార్టీల ప్రమేయం లేకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పంపిణీ చేయాలని బిజెపి  ఆధ్వర్యంలో శంకరపట్నం మండల కేంద్రంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.అర్హులైన దళితులకు డబుల్ బెడ్రూం ఇవ్వాలని, డప్పు కొట్టే వారికి చెప్పులు కొట్టేవారికి 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని వారు విజ్ఞప్తి  చేశారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ  మాట్లాడుతూ అధికార బి ఆర్ ఎస్ పార్టీ దళితులకు ఎలాంటి సహాయం చేయడం లేదని అన్నారు.   దళితులకు భూ పంపిణీ చేస్తామని అన్న మాటలు ఆచరణలో లేవనిఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి దాసరపు  నరేందర్, ఎస్సీ ఎస్టీ అధ్యక్షులు కనకం సాగర్,బిజిలి సారయ్య, సైదాపూర్ ఎంపీటీసీ జె.మల్లేశం, జి శ్రీనివాస్, పల్లె శివ రెడ్డి, ఎల్. కుమారస్వామి, ఎస్. శ్రీనివాస్, ఎం. సాయి తేజ,పి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.